తల్లిని హతమార్చిన తనయుడు

ఏదైనా దెబ్బ తలిగితే వెంటనే అమ్మా అని అరుస్తాం.. కష్టాల్లో ఉన్నప్పుడు మాతృమూర్తి ఓదార్పు కోరుకుంటాం..తల్లి తినిపించిన గోరుముద్దను తలచుకోని సందర్భం ఉండదేమో.. అమ్మ పాడిన జోలపాటను, అమ్మ నేర్పిన మంచి మాటలను మరచిపోలేని వారు ఎందరో ఉన్నారు. అయితే ఓ యువకుడు..గతి తప్పాడు. చెడు అలవాట్లకు బానిసై.. కన్న తల్లిని కిరాతకంగా హతమార్చాడు.     ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.   




కర్నూలు,ఎమ్మిగనూరురూరల్‌: తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన తల్లిని ఓ ఉన్మాది బండరాయితో కొట్టి హత్యచేసిన దుర్ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం ఆర్ధరాత్రి చోటు చేసుకుంది. పట్ణణంలోని లక్ష్మీపేటలో నివాసముంటున్న  రాజు, ఉరుకుందమ్మలకు ముగ్గురు సంతానం. రాజు..లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈయన  పెద్దకుమారుడు వీరేష్‌ చిన్నతనం నుంచి చిల్లర దొంగతనాలతో పాటు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి.. తల్లిదండ్రులను, తమ్ముడిని తిడుతూ వేధింపులకు గురిచేసేవాడు. మద్యం అతిగా తాగినప్పుడు వావి వరసలు మరచి ప్రవర్తించేవాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఉరుకుందమ్మ తన భర్త రాజును పిలుచుకురావడానికి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది.