కరోనా: నవజాత శిశువుల కోసం...

మాస్కులు ధరించాలి... శానిటైజర్లు వాడాలి... క్వారంటైన్‌లో ఉండాలి... పొడిదగ్గు, జ్వరం ఉంటే డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలి... కరోనా(కోవిడ్‌-19) కాలంలో ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన కనీస జాగ్రత్తలు ఇవి. పెద్దవాళ్లకు.. నిర్ణీత వయస్సు ఉన్న పిల్లలకు ఫేస్‌మాస్కులు, హ్యాండ్‌వాష్‌ల వంటివి  అందుబాటులో ఉంటాయి. కానీ నవజాత శిశువులకు వీటిని ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే కరోనా మహమ్మారి వలన తొలుత వృద్ధులకే పెను ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న తరుణంలో యువత, అప్పుడే పుట్టిన పసిపాపలు కూడా దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఆస్పత్రి వాతావరణం, అక్కడ ఉన్న సిబ్బంది.. అంతేగాకుండా తల్లి నుంచి కూడా శిశువులకు కూడా కరోనా సోకే అవకాశం ఉంది. (కరోనా: ‘ఆ డ్రగ్‌ తనకు పనిచేయలేదు’)